Site icon TeluguMirchi.com

సర్కార్ వారి పాట ఏప్రిల్ 1 న కష్టమే..

కరోనా మహమ్మారి మరోసారి చిత్రసీమను అతలాకుతలం చేస్తుంది. సెట్స్ ఫై ఉన్న సినిమాల షూటింగ్ లు ఆగిపోవడమే కాకుండా రిలీజ్ కు సిద్దమైన చిత్రాలు సైతం ఆగిపోయాయి. ఈ తరుణంలో ఏప్రిల్ 01 న రిలీజ్ అవుతుందన్న సర్కారు వారి పాట చిత్రం రిలీజ్ కష్టమే అని తెలుస్తుంది.

మహేశ్‌బాబుతోపాటు, కీర్తిసురేశ్‌ కూడా కరోనా బారినపడ్డారు. ఇద్దరూ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం వీరు హోం ఐసోలేషన్‌ ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. పైగా మహేశ్‌కు ఇటీవల శస్త్ర చికిత్స కూడా జరిగింది. దీంతో ‘సర్కారువారి పాట’ చిత్రీకరణ మరింత ఆలస్యం కానుంది. ఏప్రిల్‌ 1వ తేదీకి సినిమా పూర్తయ్యే సూచనలు దాదాపు కనిపించటం లేదు. ఈ క్రమంలో సినిమా విడుదల వాయిదా వేయటం తప్ప చిత్ర బృందానికి మరో అవకాశం లేదని టాలీవుడ్‌ టాక్‌. అంత సెట్ అయ్యి షూటింగ్ పూర్తి అయితే ఆగస్టు 05 న రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

Exit mobile version