మహేష్ బాబు అభిమానులకు బ్యాడ్ న్యూస్

క‌రోనా మ‌హ‌మ్మారి ఎఫెక్ట్ ఏమో కాని సినీ ప్రేక్ష‌కుల‌కి వ‌రుస‌గా బ్యాడ్ న్యూస్ లే వ‌స్తున్నాయి. క‌రోనా వ‌ల‌న ఇప్ప‌టికే ప‌లు సినిమాలు వాయిదా ప‌డ‌గా, ఇప్పుడు అప్‌డేట్స్ కూడా వాయిదా వేస్తున్నారు. సంక్రాంతి కి సర్కారు వారి పాట నుండి అప్డేట్ వస్తుందని అభిమానులు ఎదురు చూసారు, కానీ ప్రస్తుతం మహేష్ బాబు, కీర్తి సురేష్, థమన్ తో పటు సర్కారు వారి టీం లో మరికొంత మందికి కరోనా సోకింది, దీంతో సినిమా నుంచి ఈ సంక్రాంతి అప్‌డేట్‌ రావడానికి ఆలస్యమవుతుందని తెలిపింది చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. ఎప్పుడనేది వెల్లడిస్తామని, అయితే పాట వెయింటింగ్‌కి సరిపడ వర్త్ తో ఉంటుందని, అప్పటి వరకు వెయిట్‌ చేయాలని వెల్లడించింది. ఈ సందర్భంగా అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ నోట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.