సర్కారు వారి పాట షూటింగ్ ఆగిపోయిందా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే దుబాయ్ లో పూర్తి చేసుకుకుంది. తాజాగా కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో మొదలు పెట్టిన సెకండ్ షెడ్యూల్ ఇప్పుడు కాన్సల్ చేసినట్లు సమాచారం. హైద్రాబాద్ లో పెరుగుతున్న కరోనా నేపథ్యంలో మహేష్ బాబు సూచనల మేరకు షూటింగ్ ప్రస్తుతానికి ఆపేశారట. కాగా ఈ చిత్రం 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతోంది అంటూ ఇటీవలే అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర యూనిట్.

మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు . ఇందులో మహేష్ ఒక ఆర్ధిక నేరస్తుడి పాత్ర చేస్తుండగా కీర్తి బ్యాంకు ఉద్యోగినిగా కన్పించనున్నట్లు సమాచారం. థమన్ సంగీతం సమకూర్చనున్నాడు.