పుష్ప పాటలఫై అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో సంబరాలు నింపిన శరత్ చంద్ర

సుకుమార్ – అల్లు అర్జున్ కలయికలో పుష్ప మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ లో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో కనిపిస్తున్నాడు. సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్. తాజాగా ఈ మూవీలోని పాటల గురించి అప్డేట్ ఇచ్చి శరత్ చంద్ర సినిమా ఫై మరింత అంచనాలు పెంచారు.

పుష్ప పాటలు మీ ప్లే లిస్ట్ లో చాలా కాలం ఉండబోతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ గారు అందించిన పాటలు మరో లెవల్ లో ఉంటాయంటూ ఆయన ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా మరో లెవల్ లో ఉంటుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. వారి అంచనాలను మరింతగా పెంచేలా శరత్ చంద్ర నాయుడు వ్యాఖ్యలు ఉన్నాయి.