నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్సింగరాయ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ ఎస్. బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఇప్పటివరకూ చేయని అత్యంత ఆసక్తికర పాత్రను నాని చేస్తున్నారు. ఈ సినిమా కోసం నాని కొత్తగా మేకోవర్ అయ్యారు.
కోవిడ్ సెకండ్ వేవ్, భారీ ఈదురు గాలులు, వర్షాలు ‘శ్యామ్సింగరాయ్’ సెట్స్ను నాశనం చేయగలిగాయి కానీ షూటింగ్ మొత్తం కంప్లీట్ కాకుండా ఆపలేకపోయాయి. అన్ని అడ్డంకులను సమర్ధవంతంగా ఎదుర్కొని న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్సింగ రాయ్’ షూటింగ్ను విజయవంతంగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ను శరవేగంగా జరుపుతున్నామని చిత్రయూనిట్ తెలిపింది.