Site icon TeluguMirchi.com

కరణ్‌ జోహార్ కుడా బాద్యుడే

కరణ్‌ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షోలో పాండ్య, రాహుల్‌ చేసిన వ్యాఖ్యకు కారణంగా వీరిద్దరినీ సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు ఇద్దరూ దూరమయ్యారు. అయితే ఈ ఇద్దరి భవితవ్యాన్ని తేల్చడానికి అంబుడ్స్‌మెన్‌ను నియమించాలంటూ పాలకుల కమిటీ సుప్రీంకోర్టును కోరింది.

కాగా పాండ్య, కేఎల్ రాహుల్ వివాదంలో బాలీవుడ్ నిర్మాత కరణ్‌ జోహార్‌ బాధ్యత కూడా ఉందని మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌ అభిప్రాయపడ్డాడు. ‘ఒకవేళ షోకు హాజరైన వారు ఎక్కువ ఉత్సాహంతో ఉంటే.. వాఖ్యాత, ఈ ప్రపంచం ఏం వినాలనుకుంటుందో వారికి చెప్పాలి. ఛానెల్‌ కోసం ఆ వ్యక్తి గురించి అవగాహన లేకుండా ఓ ప్రశ్న అడిగితే, వచ్చిన వారు పరిణితి చెందిన వ్యక్తులు కాకపోతే ఇతరులు బాధపడే వ్యాఖ్యలు చెయొచ్చు. దానికి వ్యాఖ్యాత బాధ్యత కూడా ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు.

Exit mobile version