కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టిన సునీల్, తరవాత హీరోగా కొన్ని సినిమాలలో తన లక్ ని పరీక్షించుకున్నాడు. అయితే హీరోగా అంతగా సక్సెస్ కాలేకపోయాడు. అయితే సునీల్ కెరీర్ని ‘పుష్ప’ సినిమా అనూహ్య మలుపు తిప్పిందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. అప్పటివరకు ఓ మాదిరిగా సాగిన అతని సినీ కెరీర్.. ‘పుష్ప’ తర్వాత ఒక్కసారిగా ఊపందుకుంది. ఒకదానికి తర్వాత మరొక క్రేజీ అవకాశాలను చేజిక్కించుకుంటున్నాడు సునీల్. ఇప్పటికే సూపర్స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘జైలర్’ సినిమాలో విలన్గా సునీల్ ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పుడు లేటెస్ట్గా కోలీవుడ్ నుంచే మరో అద్దిరిపోయే ఛాన్స్ని అతను అందుకున్నాడు.
తమిళ హీరో విశాల్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్తో రూపొందుతున్న ‘మార్క్ ఆంటోనీ’ సినిమాలో సునీలో ఓ మేజర్ రోల్లో నటించే ఆఫర్ని పొందాడు. ఈ విషయాన్ని స్వయంగా చిత్రబృందమే ఒక పోస్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. ఆ పోస్టర్లో పుష్పలో సునీల్ వేసిన గెటప్నే వేయడాన్ని బట్టి చూస్తుంటే.. ఇందులోనూ కరుడుగట్టిన విలన్ పాత్రలో అతడు కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ తన స్వీయ రచనా దర్శకత్వంలో రూపొందిస్తున్నాడు. ఇందులో ఎస్జే సూర్య కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.