Site icon TeluguMirchi.com

బయటపడిన సుశాంత్ డైరీ..అందులో ఏమి రాసుకున్నాడో తెలుసా..?

బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య చేసుకొని మూడునెలలు గడుస్తున్నా ఇంకా ఆయన పేరు మీడియా లో ప్రచారం అవుతూనే ఉంది. ప్రస్తుతం ఈయన ఆత్మహత్య కేసును విచారిస్తుండగా..సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా సుశాంత్ కు సంబదించిన డైరీ బయటపడింది. ఆ డైరీ లో 2020లో ఎన్నో కార్యక్రమాలు చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. డైరీ మొదటి పేజీలో అనుభవం, విశ్లేషణపై పలు విషయాలు రాసుకున్నారు.

ఏప్రిల్ 27, 2018 నాటి నోట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన దినచర్యను రాశారు. ఆరోజు తెల్లవారుజామున 2:30 గంటలకు మేల్కొన్నారు. అతను కొన్ని వేద శ్లోకాలను పఠించాడని కూడా డైరీలో రాసుకున్నారు. మర్నాడు కేదార్‌నాథ్‌ గురించి చదవాలని ప్లాన్‌ చేసుకున్నారు. స్మోకింగ్‌ మానేయాలనే ప్రయత్నాన్ని కూడా ఆ రోజు తన డైరీ రాసుకున్నారు. రెండో పేజీలో సమస్యలను ఎలా పరిష్కరించాలి… ఎందుకు ఆనందం… సరైన సమాధానం లేదు, మంచి ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి అని రాశారు. అలాగే – అనుభవం, విశ్లేషణ, ఆనందం, ధైర్యం, బ్రిలియెన్స్ మరియు డివైన్ అని కూడా రాసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ డైరీ వైరల్ గా మారింది.

Exit mobile version