Site icon TeluguMirchi.com

ముఖ్యమంత్రికి మోర పెట్టుకున్న డైరెక్టర్

తమిళ్ డైరెక్టర్ , జాతీయ అవార్డు గ్రహీత శీను రామస్వామి తమిళనాడు ముఖ్యమంత్రికి మోర పెట్టుకున్నారు. తన జీవితం ప్రమాదంలో ఉందని, కాపాడాలని చెప్పుకొచ్చారు. శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవాలని కోరిన వారిలో రామస్వామి ఒకరు. అలా అన్నందుకు కొంతమంది నుంచి తనకు బెదిరింపు కాల్స్‌, మెసేజ్‌లు వస్తున్నాయని ఆయన ఓ ప్రెస్‌మీట్‌ పెట్టి వెల్లడించారు.

తనకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పాలిటిక్స్ గురించి తెలుసని, కానీ ఫిలిం ఇండస్ట్రీ వారు చేసే రాజకీయాల గురించి తెలీదని వివరించారు. విజయ్ సేతుపతికి, తనకు మధ్య శత్రుత్వం పెంచేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. మరి ఈయన మొరను సీఎం ఎలా రిసీవ్ చేసుకుంటాడో చూడాలి.

Exit mobile version