Site icon TeluguMirchi.com

సాయి తేజ్ తాజా హెల్త్‌ బులిటెన్‌..ఆరోగ్యం ఎలా ఉందంటే

గత వారం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అపోలో హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తేజ్ హెల్త్‌ బులిటెన్‌ ను అపోలో వైద్యులు విడుదల చేసారు. వెంటిలెటర్‌ తొలగించామని, సొంతంగానే శ్వాస తీసుకుంటున్నారని చెప్పారు. మరికొద్ది రోజులు సాయిధరమ్‌ తేజ్‌ ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటారని తెలిపారు. గత ఆదివారం సాయి ధరమ్‌ తేజ్‌కు వైద్యులు కాలర్‌ బోన్‌ సర్జరీని నిర్వహించారు. ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతున్నదని వైద్యులు వివరించారు.

Exit mobile version