సత్యదేవ్ హీరోగా ఈస్ట్కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరుతో పాటు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్పై ‘మను’ వంటి డిఫరెంట్ చిత్రాన్ని అందించిన నిర్మాత సృజన్ ఎరబోలు నిర్మాణం లో తెరకెక్కిన చిత్రం ‘తిమ్మరుసు’. జులై 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తుంది.
ట్రేడ్ వర్గాలు చెబుతున్న లెక్కల ప్రకారం ‘తిమ్మరుసు’ మూవీ తొలి రోజుకు గాను 47 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 27 లక్షల రూపాయల షేర్ వచ్చిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సత్యదేవ్ లాంటి హీరో సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయంటే సినిమాకు మంచి ఆదరణే లభించిందని చెప్పుకోవచ్చు.