డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న 16 మంది సినీ ప్రముఖులకు ఎఫ్ఎస్ఎల్(ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ) క్లీన్ చిట్ ఇచ్చింది. పూరి జగన్నాథ్, చార్మి, నవదీప్, రవితేజ, సుబ్బరాజు, తరుణ్, నందు, తనీష్, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ లో తోపాటు ఆరుగురికి క్లీన్ చిట్ ఇచ్చారు.
తరుణ్, పూరి నమూనాల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి అనవాళ్లు లేవని రిపోర్ట్ స్పష్టం చేసింది. దీనిపై గతేడాది డిసెంబరు 8న ఎఫ్ఎస్ఎల్ నివేదికలు సమర్పించినట్టు ఎక్సైజ్శాఖ తెలిపింది. కెల్విన్పై ఛార్జ్షీట్తో పాటు ఎఫ్ఎస్ఎల్ నివేదిక వివరాలను కోర్టుకు సమర్పించినట్టు ఎక్సైజ్ అధికారులు వివరించారు.