ఒంటినిండా నగలతో త్రిష లుక్ వైరల్ !


కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ పొన్నియన్ సెల్వన్. ప్రస్తుతం ఈ మూవీ మొదటి భాగం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. పాన్ ఇండియా చిత్రం కావడంతో పలు భాషలకు చెందిన దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీ ల ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి మంచి క్రేజ్ లభించగా తాజాగా ఈ రోజు నటి త్రిష పోషిస్తున్న కుందవాయి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఒంటి నిండా నగలతో చూడముచ్చటగా ఉన్న త్రిష పోస్టర్ ని ప్రిన్సెస్ అని కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 30 న అన్ని భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదలకానుంది.