అప్పుడెప్పుడు 2003 లో నీ మనసు నాకు తెలుసు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన త్రిష..ఇప్పటికి తన సత్తా చాటుతూ వస్తుంది. తెలుగు , తమిళ్ భాషల్లో సీనియర్ , యంగ్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను , అభిమానులను అలరిస్తూ వస్తుంది. ఈ తరుణంలో ఈమె పెళ్లి వార్త మరోసారి మీడియాలో హల్చల్ చేస్తుంది.
కోలీవుడ్కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్తో త్రిష ప్రేమలో పడిందని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు వీరిద్దరి పెళ్లికి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ఓ మూవీ చిత్రీకరణ సమయంలోనే ప్రేమలో పడ్డట్టుగా చెపుతున్నారు. మరి ఇది నిజామా కదా అనేది తెలియాల్సి ఉంది.