భారీ వర్షాలు, వరదలు భాగ్యనగరం హైదరాబాద్ను అతలాకుతలం చేశాయి. గడిచిన వందేళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదవడంతో హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. ముఖ్యంగా పాతనగరం అల్లకల్లోలంగా మారింది. నాలాలు పొంగి పొర్లడం, చెరువులకు గండ్లు పడటంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తిండీతిప్పలు లేక అవస్థలు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ వరద బాధితులను ఆదుకోవడం కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ ముందుకొచ్చింది. చిరంజీవి కోటి రూపాయలు, మహేష్ బాబు రూ.కోటి రూపాయలు, నాగార్జున రూ. 50 లక్షలు, ఎన్టీఆర్ రూ. 50 లక్షలు, విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు, హరీష్ శంకర్, అనీల్ రావిపూడి చెరో రూ. 5 లక్షలు విరాళం ప్రకటించగా..తాజాగా రామ్ 25 లక్షలు , త్రివిక్రమ్ 10 లక్షలు ప్రకటించారు.