అక్కడ ‘వీరసింహారెడ్డి’ దే పైచేయి


ఈ సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మరియు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ల యొక్క అడ్వాన్స్ బుకింగ్ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ప్రారంభం కాలేదు, కానీ అమెరికా, ఆస్ట్రేలియా మరియు యూకే లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమయ్యాయి. మూడు చోట్ల కూడా వీరసింహారెడ్డి సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్ అత్యధికంగా నమోదు అయినట్లుగా డిస్ట్రిబ్యూటర్స్ పేర్కొన్నారు.

దీంతో ఇక ఈసారి కూడా నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా తో భారీ అఖండ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ నందమూరి అభిమానులు ధీమాతో ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొందిన వీర సింహారెడ్డి సినిమా లో బాలకృష్ణ కు జోడిగా శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతాన్ని అందించాడు.