Site icon TeluguMirchi.com

వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేదిక ఇదే !


ఒంగోలు ఏబియం గ్రౌండ్ లో ఈ నెల 6న జరగాల్సిన వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ వేదిక మార్పుచేశారు. పక్క జిల్లాల నుంచి బాలకృష్ణ అభిమానులు తాకిడి ఎక్కువగా ఉంటుందని ఏబియం గ్రౌండ్ ఈవెంట్ నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఒంగోలు నగరంలో ఈవెంట్ నిర్వహించడం వలన ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుందని పోలీసులు అభ్యంతరం వ్యక్తచేసినట్లు తెలుస్తుంది. ఒంగోలు నగరం బయట ఈవెంట్ నిర్వహించుకోవాలని సినిమా యూనిట్ నిర్వాహకులకు పోలీసులు సూచించారు. దీంతో ప్రత్యామ్నాయంగా నగర శివారు లోని అర్జున్ ఇన్ఫ్రా వెంచర్ లో వేదిక ఖరారు చేసిన వీరసింహారెడ్డి మూవీ యూనిట్. అర్జున్ ఇన్ఫ్రా వెంచర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు..

Exit mobile version