ఇంటెన్స్ లుక్ తో వెంకీ ‘సైన్ధవ్’


ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను అలరించిన విక్టరీ వెంకటేష్ తన 75వ చిత్రం సైంధవ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఈ రోజు విడుదలైంది, ఫస్ట్ గ్లింప్స్ కి అటు అభిమానులు, ఇటు విమర్శకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. వెంకటేష్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా అయిన వెంకీ75ను ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు నిర్మాతలు సన్నాహాలు అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు.

హిట్ ఫ్రాంచైజీ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు. అయితే ఈ సినిమా విడుదల తేదీని ఇంకా నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు కానీ 2023 ద్వితీయార్ధంలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.