‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ డైరెక్టర్ ‘వేణు ఉడుగుల’ డైరెక్షన్లో రానా – సాయి పల్లవి జంటగా విరాటపర్వం సినిమా తెరకెక్కుతుంది. 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా రానున్న ఈ సినిమాలో అప్పటి రాజకీయ అంశాలను కూడా ప్రముఖంగా ప్రస్తావించబోతున్నారు. ఆ సినిమాలో రానా కామ్రేడ్ రవన్న పాత్రలో కనిపించబోతున్నాడు. సాయి పల్లవి పల్లెటూరి అమ్మాయి వెన్నెల పాత్రలో నటిస్తుంది. కరోనా కారణంగా థియేటర్స్ మూతపడడం తో ఓటిటి లో రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ డీల్ ను రద్దు చేసుకొని థియేటర్స్ లోనే రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు నుండి థియేటర్స్ ఓపెన్ కాబోతుండడం తో మరి విరాటపర్వాన్ని ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి.
నివేత పేతురాజ్, ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు, సాయిచంద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీ ప్రసాద్, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. స్టీఫెన్ రిచర్డ్, పీటర్ హెయిన్ స్టంట్స్ డిజైన్ చేస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రఫీ అందిస్తున్నారు.