Site icon TeluguMirchi.com

వరు పై విశాల్ కామెంట్

2019-2022 ఏడాదికి గానూ ఈ నెల 23న నడిగర్‌సంఘం ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో విశాల్‌ పాండవర్‌ జట్టు, కే.భాగ్యరాజ్‌ స్వామి శంకరదాస్‌ జట్టు బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. విశాల్‌ ఇటీవల శరత్‌ కుమార్‌, రాధారవి న్యాయకత్వాన్ని విమర్శిస్తూ ఓ వీడియోను అప్‌లోడ్‌ చేశారు.

దీనిపై ఇప్పటికే శరత్‌ కుమార్ కుమార్తె వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. తన తండ్రి ఈ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ఆయనపై ఇంత కక్ష సాధింపు చర్యలు ఎందుకు..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.కాగా దినిపై విశాల్ స్పదించాడు. వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమని అన్నాడు. ఆమెకు మాట్లాడే హక్కు ఉందని చెప్పుకొచ్చాడు.

Exit mobile version