సామీ సాంగ్ కు కుమ్మేసిన నోటా హీరోయిన్

పుష్ప లోని సామీ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. అభిమానులే కాదు సినీ స్టార్స్ సైతం ఈ సాంగ్ కు డాన్సులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ‘నోటా’ సినిమాతో ఒకేసారి కోలీవుడ్, టాలీవుడ్ కు పరిచమైన యషికా ఆనంద్..సామీ సాంగ్ కు అదిరిపోయే స్టెప్స్ వేసి అభిమానులను ఆకట్టుకుంది.

ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ అంతకు ముందు కొన్ని సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే గతేడాది జులైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృత్యువు అంచుల వరకు వెళ్లొచ్చిందీ. ఈ ప్రమాదంలో ఆమె స్నేహితురాలు చనిపోగా యషిక మూడు నెలల పాటు ఆస్పత్రి బెడ్ కే పరిమితమైంది. నిరంతరం వైద్యుల పర్యవేక్షణ, ఫిజియో థెరపిస్టుల సలహాలు తీసుకుని ఇప్పుడు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ క్రమంలో మళ్లీ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సినిమా ఛాన్సుల కోసం ట్రై చేస్తుంది.