Site icon TeluguMirchi.com

కుక్ కు ఘనమైన వీడ్కోలు.. భారత్ పతనం

ఇంగ్లాండు ఓపెనర్ అలిస్టర్ కుక్ తన ఆఖరి టెస్టు మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు. ఓవల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో కుక్ సెంచరీ చేయగానే గ్యాలరీలోని ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల చప్పట్లు మిన్నంటాయి. తన చివరి మ్యాచ్ లో సెంచరీ పూర్తి చేసిన కుక్ కొంత భావోద్వేగానికి గురయ్యాడు. ఓవల్ లో సెంచరీతో కుక్ తన టెస్టు కెరీర్ లో 33వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు.

కాగా ఐదో టెస్టులో 464 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 2 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (1) మరోసారి విఫలమయ్యాడు. అదే ఓవర్‌లో తొలి డౌన్‌లో వచ్చిన పుజారా కూడా పరుగులేమీ చేయకుండా ఎల్బీగానే పెవిలియన్‌ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ బ్రాడ్‌ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. దింతో భారత్ కష్టాల్లో పడింది.

Exit mobile version