Site icon TeluguMirchi.com

ఏపీ పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు..

ఆంధ్రప్రదేశ్‌ పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను శుక్రవారం (జులై 6) రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేసారు. ఏపీ సచివాలయంలోని తన చాంబర్‌లో ఈ ఫలితాలను విడుదల చేసి మీడియా కు తెలియజేసారు.

ఫలితాల్లో మొత్తం 52.42 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. జూన్ 11 నుంచి 25 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరిగింది. మొత్తం ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 35,140 మంది పరీక్షకు హాజరు కాగా, 18,424 ఉత్తీర్ణత సాధించారు. 16,707 మంది బాలికలు పరీక్షకు హాజరవగా 8745 మంది పాసయ్యారు. గత సంవత్సరం కంటే 18 శాతం తక్కువగా ఫలితాలు వచ్చాయిని తెలిపారు.

Exit mobile version