ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత రాత పరీక్ష(టెట్) ఫలితాలు సోమవారం ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. మొత్తం 57.48 శాతం మంది అర్హత సాధించినట్లు మంత్రి తెలిపారు. విశాఖ పట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది.
మొత్తం ఈ పరీక్షకు 3,97,957 మంది దరఖాస్తు చేసుకోగా 3,70,573మంది హజరయ్యారని.. వారిలో 2,13,042 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. పేపర్-1లో వేమన కుసుమ(146 మార్కులు) మొదటి ర్యాంక్ సాధించారు. అలాగే పేపర్-2 సోషల్లో ఆర్ల విష్ణుప్రియ(136 మార్కులు), పేపర్-2ఏ గణితం, సైన్స్లో విజయలక్ష్మి(135 మార్కులు) ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ముందుగా పేర్కొన్న షెడ్యూల్ మేరకు అయితే జూన్ 30న విడుదల చేయాల్సి ఉంది. కొన్ని అనివార్య సాంకేతిక కారణాలతో రెండు రోజులు ఆలస్యంగా ఫలితాలను విడుదల చేశారు.
* టెట్-2018 ఫలితాల టాపర్స్ లిస్ట్ చూస్తే..
పేపర్ 1 – వేమన కుసుమ, కృష్ణా జిల్లా 146 మార్కులు
పేపర్ 2ఏ సోషల్ స్టడీస్ – ఆర్ల విష్ణుప్రియ, ఒంగోలు, ప్రకాశం జిల్లా 136 మార్కులు
పేపర్ 2ఏ మాథ్స్ అండ్ సైన్స్ – ఇమంది విజయలక్ష్మి, విజయ నగరం 135 మార్కులు
పేపర్ 2ఏ – పాతకోకల బేబీ షాలిని పశ్చిమ గోదావరి, 135 మార్కులు
పేపర్ 2ఏ తెలుగు – చింతపల్లి లావణ్య, నెల్లూరు, 134 మార్కులు
పేపర్ 2ఏ హిందీ – అచ్చుకుట్ల గౌసియా, కడప, 142 మార్కులు
పేపర్ 2ఏ ఇంగ్లిష్ – ఎం ప్రభాకర్ బాబు, గుంటూరు 138 మార్కులు
పేపర్ 2బీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ – షేక్ షంషుద్దీన్, కృష్ణా, 135 మార్కులు
పేపర్ 2బీ ఫిజికల్ ఎడ్యుకేషన్ – పాముల వేణుగోపాల్, చిత్తూరు 135 మార్కులు.