Site icon TeluguMirchi.com

బంగ్లా టార్గెట్ 149


బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. టీమ్ ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. బౌండరీతో ఇన్నింగ్స్ ను ఆరంభించిన రోహిత్ శర్మ తొలి ఓవర్ ఆఖరి బంతికే ఔటయ్యాడు.

బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ (22, 13 బంతుల్లో; ఫోర్, 2 సిక్సర్లు) ధావన్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. భారత బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధావన్-41, రిషబ్ పంత్-27, శ్రేయస్-22, రోహిత్ శర్మ-9, కేఎల్ రాహుల్-15, శివం దూబే-1 పరుగులు చేసి ఔటవ్వగా క్రునాల్ పాండ్యా-15, సుందర్-14 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

Exit mobile version