Site icon TeluguMirchi.com

మీ చిరునవ్వు కోసం బ్యాట్ పడతా: సచిన్

sachinప్రతిష్టాత్మక భారతరత్న అవార్డును భారత క్రికెట్ దిగ్గజం సచిన్ రమేష్ టెండూల్కర్‌, రాష్ట్రపతి చేతుల మీదగా అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సచిన్ ‘రిటైరైనా.. భారతీయుల చిరునవ్వు కోసం మళ్లీ బ్యాట్ పడతానని, దేశ ప్రజల ఆనందం కోసం నా శక్తిమేర పాటు పడతా’ అని చెప్పారు. ఇది తనకు అత్యున్నత గౌరవమని, ఈ దేశంలో పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు. ఈ అవార్డును తన తల్లితోపాటు.. తమ పిల్లల స్వప్నాల కోసం త్యాగాలు చేసిన అమ్మలందరికీ అంకితం చేస్తున్నట్లు సచిన్ ప్రకటించారు. సచిన్ తో పాటు శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావు కూడా భారతరత్నను అందుకున్నారు. గత ఏడాది వీరిద్దరికీ ‘భారతరత్న’ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Exit mobile version