Site icon TeluguMirchi.com

గ్యాంగ్‌ రేప్‌ కు నిరసనగా భారత్ బంద్

bharat-bandh. ఈ సంఘటనతో ఉవ్వెత్తున ఢిల్లీ వ్యాప్తంగా యువతలో ఆవేశం ఎగసిపడడంతో పాటుగా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా నిందితులను ఘోరంగా శిక్షించాలనే డిమాండ్ చేశాయి. తాజాగా బీజేపీ కూడా నిందితులకు సాధ్యమైనంత పెద్ద శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా అత్యాచార కేసుల్లో  నిందితులను కఠినంగా శిక్షించేలా చట్టం తీసుకురావాలని దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రాజేష్ గౌరవ్,  బాబు సింగ్ ఇద్దరు యువకులు కూడా గత కొద్ది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే! ఇప్పటివరకూ ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటనపై వెల్లువెత్తిన నిరసనల ప్రభంజనం, యువత ఆవేశాలు చూస్తే… రేపు చేపట్టబోతున్న భారత్ బంద్ లో ముఖ్యంగా యువత భారీగా పాల్గొని విజయవంతం చేసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

Exit mobile version