Site icon TeluguMirchi.com

సివిల్స్‌-2020 ఫలితాలు విడుదల!

సివిల్స్‌-2020 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 761 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. 263 మంది జనరల్‌, 229 OBC, 122 SCీ, 61 STటీ, 86 మంది EWS కేటగిరి అభ్యర్థులు ఎంపికయ్యారు. కాగా సివిల్స్‌లో ఐఐటీ బాంబే నుంచి బీటెక్‌(సివిల్‌ ఇంజనీరింగ్‌) చేసిన శుభం కుమార్‌కు మొదటి ర్యాంకు రాగా, బీటెక్‌లో ఎలక్రికల్‌ ఇంజనీరింగ్‌ చేసిన జాగృతి అవస్తికి రెండో ర్యాంకు వచ్చింది. మహిళల విభాగంలో అవస్తి టాపర్‌గా నిలవడం విశేషం.

ఇక సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
పి. శ్రీజకు 20వ ర్యాంకు
మైత్రేయి నాయుడుకు 27వ ర్యాంకు
జగత్‌ సాయికి 32వ ర్యాంకు
దేవగుడి మౌనికకు(కడప) 75వ ర్యాంకు
రవి కుమార్‌కు 84వ ర్యాంకు
యశ్వంత్‌ కుమార్‌ రెడ్డికి 93వ ర్యాంకు

Exit mobile version