Site icon TeluguMirchi.com

ఐదో టెస్టు : తొలి ఇన్నింగ్స్ భారత్ 292 ఆలౌట్


ఐదో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 292 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా అద్భుత ఇన్నింగ్స్‌ హైలైట్ గా నిలిచింది. ఆయన 86 పరుగులతో ఒంటరి పోరాటం చేశారు. మూడో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 174/6తో ఆట మొదలు పెట్టిన కోహ్లీసేన ఊహించిన దానికన్నా బాగా ఆడింది. ఆలౌట్‌ అయ్యేలోపు 118 పరుగులు జత చేసింది. దీంతో.. 40 పరుగుల లోటు మిగిల్చింది.

జడేజా 86, విహారీ 56, కోహ్లీ 49 పరుగులతో రాణించారు. షమి మరోసారి సహచరుడికి అండగా నిలవకుండా పేలవ షాట్‌కు నిష్కరమించాడు. చివర్లో బుమ్రా సాయంతో చివరి వికెట్‌కు 32 పరుగుల భాగస్వామ్యం అందించాడు జడ్డూ. ఇంగ్లండ్‌ బౌలర్లు అండర్సన్‌ 2, స్టోక్స్‌ 2, మెయిన్‌ అలీ 2 వికెట్లు తీశారు.

Exit mobile version