Site icon TeluguMirchi.com

చిత్తుగా ఓడిపోయిన విరాట్ సేన

ఇంగ్లాండ్-భారత్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 159 పరుగులతో ఇన్నింగ్స్ ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి 107 పరుగులకే కుప్పకూలిన భారత్ జట్టు రెండో ఇన్నింగ్ ్సలో 130 పరుగులకే కుప్పకూలింది. లార్డ్స్‌లో విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేయాలన్న కోహ్లీసేన కల నెరవేరలేదు. బ్యాట్స్‌మెన్‌ అంతా సమష్టిగా విఫలం కావడంతో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 159 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది.

అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 357/6తో నాల్గొ రోజు ఆటని ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 88.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 396 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది. అప్పటీకే ఇంగ్లాండ్ జట్టు 289 పరుగుల అధిక్యంలో ఉంది. కాగా రెండు వరుస ఓటములతో మిగతా మూడు టెస్టులను కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది భారత్. మొదటి టెస్ట్ లో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Exit mobile version