ఢిల్లీ రోహిణి కోర్టు ఆవరణలో కాల్పులు, గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ గోగి మృతి !

ఢిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ గోగిపై ప్రత్యర్థులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్‌ సహా మొత్తం నలుగురు మృతి చెందినట్లు సమాచారం. జితేందర్‌ను కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకువస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. న్యాయవాదుల వేషధారణలో వచ్చిన దుండగులు కోర్టు ఆవరణలోనే కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.