Site icon TeluguMirchi.com

గుడ్ న్యూస్ : రూ.153లకే 100 ఛానెల్స్

టీవీ ప్రేక్షకులకి ట్రాయ్ (టెలీకామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 153.40లకే 100 ఛానెల్స్ అందించాలని ట్రాయ్ నిర్ణయం తీసుకొంది. ఫిబ్రవరి 1 నుంచి ఈ ప్యాకేజ్ అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. కేబుల్ కనెక్షన్ ఉన్నా, DTH అయినా 100 ఛానళ్లను ఇదే ధరకు అందించాలని సర్వీస్ ప్రొవైడర్లకు సూచించింది.

ఇంతకుముందు ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త నిబంధనల కారణంగా వినియోగదారులు నెలకి రూ. 400 – 450 కేబుల్ బిల్లు కట్టాల్సి ఉంటుంది. తెలుగు ప్యాకేజ్ ఛానెల్స్ కావాలంటే రూ. 283 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడీ నిబంధనలని సడలించి రూ. 153కే 100 ఛానెల్స్ ప్యాకెజ్ ని తీసుకొచ్చి.. టీవీ ఛానెల్స్ కి ఉపశమనం కలిగించింది.

Exit mobile version