Site icon TeluguMirchi.com

బొక్కబోర్లా పడ్డ విద్యాశాఖ మంత్రి..

అలవాటు లేని పరుగు తీస్తూ బొక్కబోర్లా పడ్డాడు కర్ణాటక విద్యాశాఖ మంత్రి జీటీ దేవగౌడ..ఈ ఘటన మైసూర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..దసరా ఉత్సవాల్లో భాగంగా మైసూర్‌లో నిర్వహించిన హాఫ్‌ మారథాన్‌లో జీటీ దేవగౌడ పాల్గొన్నారు. స్థానికులతో కలసి పరుగు పెట్టాడు.

అయితే కొంత దూరం పరుగెత్తిన మంత్రి ఆ తర్వాత బొక్కబోర్లా పడ్డారు. వెంటనే ఆ పక్కనే ఉన్న అధికారులు ,సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని పైకి లేపారు. ఆ ఘటన లో ఆయనకు మోకాళ్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటన కు సంబందించిన వీడియో నెట్ లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పంచెతో పరుగు ఏంటి దేవా..అని కామెంట్స్ వేస్తున్నారు.

Exit mobile version