Site icon TeluguMirchi.com

షార్‌లో హైఅలర్ట్


ఇటీవల శ్రీలంకలో ఉగ్రదాడులు జరిగిన నేపథ్యంలో భారత్‌లోని దక్షిణాది రాష్ట్రాల్లో దాడులు జరిగే అవకాశాలున్నాయని కేంద్ర నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. షార్‌ నుంచి బుధవారం పీఎస్‌ఎల్వీ ప్రయోగం జరగనుండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. షార్‌ లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

జిల్లాలోని విడవలూరు మండలం పన్నపూడిపాతవూరు సముద్రతీరంలో రెండు రోజుల క్రితం శ్రీలంకకు చెందిన ఓ బోటును గుర్తించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో షార్‌లోని సీఐఎస్ఎఫ్‌, స్థానిక పోలీసులు, మెరైన్‌ పోలీసులు, కోస్ట్‌ గార్డు సిబ్బంది తీరంలో గస్తీ ముమ్మరం చేశారు.

Exit mobile version