Site icon TeluguMirchi.com

తడబాటుతో మొదలయిన భారత్‌ బ్యాటింగ్‌

Cricket - India v Pakistan 2nd ODI Kolkataలేటెస్ట్‌ స్కోర్‌ : ఇండియా 167/10 (43.4 ఓవర్లు)

పాకిస్థాన్ తో న్యూఢిల్లీ లో జరుగుతున్న మూడో వన్డేలో టాస్‌ గెలిచి భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. మొదటినుండే తడబాటుతో 29 పరుగులకే భారత్ ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. గంభీర్‌ (15), రహానే (4) పరుగులు చేసి అవుటయ్యారు. మహ్మద్ ఇర్ఫాన్ వీరిద్దరినీ అవుట్ చేశాడు. కోహ్లి(7) మూడో వికెట్ గా మరో 8 పరుగులు జోడించిన తర్వాత జునైద్ ఖాన్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. యువరాజ్‌ సింగ్‌ కాసేపు స్కోర్‌ బోర్డ్‌ ను పరుగులు పెట్టించినా హఫీజ్‌ బౌలింగ్‌ లో 23 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. ధోనీ 36 పరుగులు, రైనా 31, జడేజా 27 పరుగులు చేశారు. భారత్ 43.4 ఓవర్లలో 167 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. పాకిస్తాన్ విజయలక్ష్యం 168 పరుగులుగా నిర్ధేశించింది.

Exit mobile version