రేపటినుండి భార‌త, శ్రీ‌లంక ఉమ్మ‌డి సైనిక విన్యాసాలు

భార‌త, శ్రీ‌లంక ద్వైపాక్షిక ఉమ్మ‌డి సైనిక విన్యాసం ‘మిత్ర శక్తి 21’ 8 ఎడిషన్‌ను అక్టోబర్ 4 – 15 వరకు, శ్రీలంకలోని అంపారాలో నిర్వహించనున్నారు. అన్ని ఆయుధాలు ప‌ఠాలాలకు చెందిన 120 మంది భారత సైన్యంతో కూడిన బృందం శ్రీలంక సైన్యం యొక్క బెటాలియన్‌తో పాటు విన్యాసంలో పాల్గొంటాయి. రెండు దేశాల సైన్యాల మధ్య సన్నిహిత సంబంధాలను ప్రోత్సహించడం, ఇంటర్-ఆపరేబిలిటీని మెరుగుపరచడం, తిరుగుబాటు మరియు కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లలో ఉత్తమ పద్ధతులను పంచుకోవడం ఈ విన్యాసాల‌ యొక్క ముఖ్య‌ ధ్యేయం.