Site icon TeluguMirchi.com

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ డేట్ వచ్చేసిందోచ్..

ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ను నిర్వహించబోతున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఈ ఎగ్జామ్స్ జరగనున్నట్లు అధికారులు తెలియజేసారు. ఈ మేరకు ఇంటర్‌బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.

సుమారు 2లక్షలకు పైగా విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరుకానున్నారు. ట్యూషన్ ఫీజులు చెల్లించకపోవడం వంటి కారణాలతో విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుంటే.. కఠినచర్యలు తీసుకుంటామని కళాశాలల యాజమాన్యాలను బోర్డు హెచ్చరించింది. విద్యార్థులు ప్రాక్టికల్ ప్రశ్నపత్రాన్ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

Exit mobile version