Site icon TeluguMirchi.com

మియాందాద్ భారత్ పర్యటన రద్దు

javed-miyandajపాకిస్ధాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ భారత్ పర్యటనను రద్దు చేసుకున్నాడు. పాకిస్థాన్-ఇండియా జట్ల మధ్య జనవరి ౬న ఢిల్లీలో జరిగే వన్ డే క్రికెట్ మ్యాచ్  క్షించేందుకుగానూ మియాందార్ వీసా తీసుకున్న విషయం తెలిసిందే.  మియాందాద్ దావుద్ ఇబ్రహీం వియ్యంకుడు కావడంతో అతని భారత్ పర్యటనపై శివసేన నాయకుడు, సామ్నా పత్రికలో ప్రశ్నించాడు. ముంబాయు పేళ్లుళ్ల నిందితుడు దావుద్ ఇబ్రహీంతో సంబంధం ఉన్న మియాందాద్ కు వీసా జారీ ఇవ్వడం పట్ల ఉద్దవ్ ఠాక్రే త్రీవంగా విమర్శించారు. దీంతో జావేద్ మియాందాద్ భారత్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం.

Exit mobile version