జేఈఈ మెయిన్-2021 మూడో సెష‌న్ పరీక్షలు వాయిదా

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో దేశంలో ఇప్పటికే ప‌లు ప‌రీక్షలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు జేఈఈ మెయిన్-2021 మూడో సెష‌న్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27, 28, 30 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ ప‌రీక్షల‌ను వాయిదా వేయ‌డంతో ఈ పరీక్షల రీషెడ్యూల్ గురించి క‌రోనా వ్యాప్తి అదుపులోకి వ‌చ్చాక… 15 రోజుల ముందు విద్యార్థులకు సమాచారం అందిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. తొలి రెండు సెష‌న్ల ప‌రీక్షలు ఇప్పటికే ముగిశాయి.