భారత ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ కన్నుమూత

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మాజీ కమిషనర్‌ డాక్టర్‌ జీవీజీ కృష్ణమూర్తి (86) కన్నుమూశారు. వయోపరమైన సమస్యలతో ఢిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన కృష్ణమూర్తి ఇండియన్‌ లీగల్‌ సర్వీస్‌కు ఎంపికై.. తొలుత భారతీయ లా కమిషన్‌లో సీనియర్‌ రీసెర్చ్‌ అసిస్టెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం న్యాయశాఖ కార్యదర్శి స్థాయికి ఎదిగారు.1993 అక్టోబరు 1 నుంచి 1996 సెప్టెంబరు30 వరకు ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వహించారు.