ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కోల్పోయిన భారత అథ్లెట్లకు కార్లు గిఫ్ట్

ఇటీవల ముగిసిన ఒలింపిక్స్‌లో తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయిన భారత అథ్లెట్లకు ఆల్ట్రోజ్ కార్లను బహుమతిగా ఇచ్చినట్లు టాటా మోటార్స్ సంస్థ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. అత్యంత కఠిన పరిస్థితులలో తృటిలో వారు పథకాన్ని కోల్పోయి ఉండవచ్చు కానీ, వారు దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. భారత ఒలింపిక్ జట్టు దృఢత్వం, సంకల్పం వారిని మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. వారు ప్రతి దశలో అంచనాలను మించి సత్తా చాటారు, చివరి శ్వాస వరకు పోరాడారు. అందుకే దేశంలోని మిలియన్ల మంది హృదయాలను వారు గెలుచుకున్నారు అని టాటా సంస్థ పేర్కొంది.