తిరుమలలో ప్లాస్టిక్ వాడకం నిషేధం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధానికి భక్తులు సహకరించాలని టీటీడీ ఆరోగ్యవిభాగం అధికారి డాక్టర్‌ ఆర్‌.ఆర్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.తిరుమలలో ప్లాస్టిక్‌ కవర్లు,వాటర్‌ బాటిళ్ల నిషేధంపై గత ఏడాది అక్టోబర్‌19వ తేదీ నుంచి భక్తులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ప్లాస్టిక్‌ రహిత సప్తగిరులుగా తీర్చిదిద్దడానికి తిరుమలకు విచ్చేసే యాత్రికులు, ఉద్యోగులు, స్థానికులు, వ్యాపార సంస్థలకు అవగాహన కల్పించారు.