Site icon TeluguMirchi.com

ప్రణయ్ హత్య కేసు : 7గురు నిందితులు వీరే


మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణయ్ ని హత మార్చడానికి పలు మార్లు విఫలయత్నం జరిగినట్టు నల్గొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు. నల్గొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.

ఈ కేసులో ఏడుగురు నిందితులు వీరే :

* ఏ1 – మారుతీ రావు (అమృత తండ్రి)

* ఏ2 – సుభాష్ శర్మ (బీహార్)

* ఏ3 – అస్గర్ అలీ

* ఏ4 – మహ్మద్ బారీ

* ఏ5 – అబ్దుల్ కరీం

* ఏ6 – శ్రవణ్ (బాబాయ్)

* ఏ7 – సముద్రాల శివగౌడ్ (డ్రైవర్)

ఈ హత్యకు కోటి రూపాయలను డిమాండ్ చేసిన అస్గర్… చివరకు రూ. 50 లక్షలకు ఒప్పుకున్నాడని ఎస్పీ తెలిపారు. ఆగస్ట్ 9వ తేదీ నుంచి రెక్కీ జరిగిందని, మిర్యాలగూడలోని బ్యూటీ పార్లర్ వద్ద ఆగస్ట్ 14న ప్రణయ్ ని చంపేందుకు తొలి ప్రయత్నం చేశారు. ఆగస్ట్ 17న వెడ్డింగ్ రిసెప్షన్ ను టార్గెట్ చేశారని చెప్పారు. ఆగస్ట్ 22న ఇంటి వద్దే ప్రణయ్ ను హత్య చేసేందుకు విఫల యత్నం చేశారని తెలిపారు. చివరకు ఈ నెల 14న ప్రణయ్ ను హతమార్చారని చెప్పారు

Exit mobile version