మరో ప్రేమ వివాహం విషాదంగా మారింది భార్యను ఆమె తల్లిదండ్రులు తీసుకు వెళ్లిపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వివరాల్లోకి వెళితే సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రక్షపురంకు చెందిన శ్రీకాంత్ మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే అతడి భార్యను ఆమె తల్లిదండ్రులు బలవంతంగా తీసుకు వెళ్లిపోవడంతో తీవ్ర ఆందోళన చెందిన శ్రీకాంత్ నిన్న రాత్రి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.
దింతో పోలీసులు, స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరే సరికే ఒళ్లంతా కాలిపోయిందని, బతకడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పినప్పటికీ.. శ్రీకాంత్ను బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది.