Site icon TeluguMirchi.com

ఫైనల్స్ భయం లేదు : సింధు

తెలుగు తేజం పీవీ సింధు ఒక్క అడుగులో స్వర్ణం చేజార్జుకుంటోంది. ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లోనూ అదే జరిగింది. పట్టుదలతో ఫైనల్ కు చేరిన సింధు.. పైనల్ లో ఓటమిపాలైంది. దీంతో రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ టోర్ని తర్వాత సింధు ఫైనల్స్ కు వచ్చి ఓడిపోతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ కామెంట్స్ సింధు చెవికి చేరాయి. తాజాగా, వీటిపై సింధు స్పందించింది. ఫైనల్స్ లో ఓడిపోయానని బాధపడనని, మరో పతకం వచ్చిందని సంతోషిస్తానని తెలిపింది. తాను ఫైనల్స్ కు వచ్చి ఓడిపోతున్నానని కొందరు అంటున్నారని, కానీ ఫైనల్స్ కు రావడం ఎంత కష్టమో వారు తెలుసుకోవాలని చెప్పింది. వచ్చే ఏడాది తాను స్వర్ణ పతకం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.

Exit mobile version