రాజు మృతి తో అంత సంబరాలు

సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిని రేప్ చేసి , హత్య చేసిన రాజు..మృతి చెందాడు. స్టేషన్ ఘనపూర్ రైల్వే ట్రాక్ ఫై కోణార్క్ రైల్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు మృతి వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో సంతోషం నింపింది. మృతుడి చేతిపై మౌనిక అనే పేరుతో ఉన్న టాటూ ఆధారంగా అతడు హత్యాచార నిందితుడు రాజు అని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఇక నిన్న రాత్రి రైల్వే స్టేషన్ పైన నిద్ర పోయినట్లుగా చెప్తున్నారు పోలీసులు.. ఇవాళ ఉదయం పై నుంచి కిందకి దిగి సమీపంలోని సంఘటన స్థలం వరకు చేరుకున్న రాజు..రైల్వే ట్రాక్ రిపేర్ చేస్తున్న వాళ్ళ చూసి పొదల్లో దాచుకున్నట్లు ప్రత్యేక్ష సాక్షులైన రైల్వే కీమెన్లు చెబుతున్నారు.

అయితే ఈ రైల్వే కీమెన్లు వెళ్ళిన తర్వాత కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు రాజు. ఆఅ తర్వాత రాజు చనిపోయిన విషయాన్ని రైల్వే సిబ్బందికి, మరియు పోలీసులకు రైల్వే కీమెన్లు సమాచారం ఇచ్చారు.