Site icon TeluguMirchi.com

తన గర్భం గురించి చెప్పిన సానియా

భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ప్రతిష్టాత్మక పోరుకు రంగం సిద్ధమైంది. ఎప్పుడు తలపడ్డా క్రికెట్‌ ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించే దాయాది జట్లు మరోసారి.. క్రికెట్‌ ప్రేమికులకు కనువిందు చేయడానికి సిద్ధమయ్యాయి . ఏడాది విరామం తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ పోరుకు రంగం సిద్ధమైంది. ఆసియా కప్‌లో భాగంగా బుధవారం గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నాయి.

ఈ సందర్భంగా ప్రముఖ టెన్నిస్‌ స్టార్ ‌ సానియా మీర్జా ట్వీట్‌ చేశారు. ఇండియా-పాక్‌ మ్యాచ్‌ మొదలు కావడానికి ఇంక 24గంటల సమయం కూడా లేదు. కొద్ది రోజుల పాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండటం మంచిది. నాన్సెన్స్‌ నుంచి కొంతైనా ఉపశమనం కలుగుతుంది. ప్రస్తుతం నేను గర్భిణిని. నేను ఇలాంటి అంశాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా. నెటిజన్లందరికీ నా మనవి. ఇది కేవలం క్రికెట్‌ మ్యాచ్‌ మాత్రమే. దాన్ని అదే కోణంలో చూడండి’ అంటూ ట్వీట్‌ చేశారు.

Exit mobile version