శివమ్‌ మావి… నెక్స్ట్ జనరేషన్ బౌలర్ ?


శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు టీమ్‌ఇండియా బౌలర్‌ శివమ్‌ మావి. ఆడిన మొదటి మ్యాచ్‌లోనే అద్భుతంగా బౌలింగ్‌ చేసి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి 22 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. హార్దిక్‌ పాండ్య నేతృత్వంలో యువ ఆటగాళ్లతో సరికొత్తగా మారిన టీ20 జట్టు.. తొలి టీ20లో 2 పరుగుల తేడాతో లంకను ఓడించింది.