Site icon TeluguMirchi.com

లంకని చిత్తు చేసిన భారత్


శ్రీలంకతో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 143 పరుగుల విజయలక్ష్యాన్ని 17.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ సిక్సర్ తో మ్యాచ్ ముగించి తన క్లాస్ టచ్ చాటాడు. కోహ్లీ 17 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతకుముందు, లక్ష్యఛేదనలో ఓపెనర్లు కేఎల్ రాహుల్ 32 బంతుల్లో 45, ధావన్ 32, శ్రేయాస్ అయ్యర్ 34 పరుగులు చేసి విజయంలో తమవంతు పాత్ర పోషించారు

అంతకుముందు భారత్ టాస్ గెలిచి మొదట శ్రీలంకకు బ్యాటింగ్ అప్పగించింది. శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసింది.

Exit mobile version