40 మంది DSPలకు పదోన్నతులు కల్పించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో 40 మంది DSP (సివిల్‌) లకు అదనపు ఎస్పీలుగా (సివిల్‌) పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2012 బ్యాచ్‌కు చెందిన 40 మంది DSPల పదోన్నతుల అంశం గత 5 ఏదేళ్లుగా పెండింగ్‌లో ఉంది. దీని కోసం ప్రభుత్వం డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సు మేరకు అధికారులకు పదోన్నతి కల్పించింది. ఈ మేరకు DSPలకు పదోన్నతులు కల్పిస్తూ.. హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కోర్టులో లేదా ట్రిబ్యునల్‌లో ఏవైనా కేసులు పెండింగ్‌లో ఉంటే.. వాటిపై తీర్పునకు లోబడి ఈ ఉత్తర్వులు అమలు చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.